పరశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతుండగా, జి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మహేష్ కెరీర్లో 27వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న విషయం విదితమే. ఈ సినిమాలో మహేష్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా త్వరలోనే యు.ఎస్లో చిత్రీకరణ జరుపుకోనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇండస్ట్రీ నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం బాలీవుడ్ నటి విద్యా బాలన్ ‘సర్కారు వారి పాట’లో నటించనున్నారు. మహేష్ బాబు అక్కగా విద్యా బాలన్ నటించనున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
previous post