telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై జరిగిన దాడి ప్రయత్నాన్ని ఖండించిన భానుప్రకాశ్‌రెడ్డి

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై జరిగిన దాడి ప్రయత్నాన్ని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం పెదపేటలో శ్రీరామనవమి సందర్భంగా ఆలయ సందర్శనకు వెళ్లిన సమయంలో ఈ దాడి జరగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

భక్తి ముసుగులో హింసను ప్రేరేపించడం దారుణమని విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న డిప్యూటీ స్పీకర్‌పైనే దాడికి యత్నించడం ప్రజాస్వామ్యంలో గర్హనీయమని ఆయన పేర్కొన్నారు.

ఈ దాడి వెనుక ఉన్న దోషులను గుర్తించి, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Related posts