ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు.
దేశ రాజధాని ఢిల్లీలో నిన్న జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నారు.
అవార్డు స్వీకరణ అనంతరం మీడియాతో తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ పురస్కారం అందుకోవడం పట్ల బాలకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు.
తన అభిమానులకు, భారత ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తనకు ఈ అవార్డు ఎప్పుడో రావాల్సిందని కొందరు అభిమానులు అభిప్రాయపడుతుంటారని, అయితే తనకు సరైన సమయంలోనే పద్మభూషణ్ వచ్చిందని తాను భావిస్తున్నట్లు బాలకృష్ణ పేర్కొన్నారు.
“వరుసగా నేను నటించిన నాలుగు సినిమాలు ఘన విజయం సాధించడం,
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించి 15 సంవత్సరాలు పూర్తి కావడం,
ముఖ్యంగా నేను సినీ రంగ ప్రవేశం చేసి 50 ఏళ్లు పూర్తయిన ఈ తరుణంలో ఈ పురస్కారం రావడం నాకు ఎంతో ప్రత్యేకం” అని ఆయన వివరించారు.


ప్రజా సమస్యలపై పోరాడుతా : పవన్