స్కూటర్లు రాజ్యమేలిన కాలంలో భారత్ లో బజాజ్ చేతక్ కు విపరీతమైన డిమాండ్ ఉండేది. కాలగమనంలో వెనుకబడిపోయిన ఈ స్కూటర్ తయారీని బజాజ్ సంస్థ నిలిపివేసింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో తన పాతకాపుకు కొత్తరూపు కల్పించి మళ్లీ రంగంలోకి దించాలని బజాజ్ నిర్ణయించుకుంది.
ఈసారి ఎలక్ట్రిక్ వెర్షన్ గా మార్కెట్లో ప్రవేశించనుంది. దీనికి అమర్చిన లిథియం అయాన్ బ్యాటరీ సుమారు 70,000 కిలోమీటర్ల వరకు పనిచేస్తుందని కంపెనీ వర్గాలంటున్నాయి. 5 గంటల్లోనే 80 శాతం చార్జింగ్, అల్లాయ్ వీల్స్, సరికొత్త ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ దీని ప్రత్యేకతలు. ఈ కొత్తతరం చేతక్ ను మహారాష్ట్రలోని చకన్ యూనిట్ లో తయారుచేస్తున్నారు. కాగా, దీని ధర ఎంతన్నది ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది.
ఆనాడు కేసీఆర్ మేల్కొని ఉంటే ఎంతో బాగుండేది: విజయశాంతి