telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మరో ముగ్గురు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను టీడీపీ అధినేత,  ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టారు. రాజమండ్రి పార్లమెంట్‌ పరిధిలోని 3 అసెంబ్లీ స్థానాల నేతలతో  చంద్రబాబు మాట్లాడారు. నేతలతో చర్చించిన అనంతరం ఆయన మూడు  నియోజవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. రాజానగరం టికెట్ పెందుర్తి వెంకటేష్‌కు, రాజమండ్రి రూరల్ టికెట్ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి, గోపాలపురం టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు ఖరారు చేశారు. సమయం లేకపోవడంతో అనపర్తి, రాజమండ్రి సిటీ, కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గ నేతలతో చంద్రబాబు సమావేశం కాలేదు. కర్నూలు పర్యటన తర్వాత మిగతా స్థానాల నేతలతో సీఎం భేటీ కానున్నారు.

రాజమండ్రి సిటీకి ఆదిరెడ్డి అప్పారావు ఫ్యామిలీ, చల్లా శంకర్రావు మధ్య పోటీ నెలకొంది. కొవ్వూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి జవహర్ ఉన్నారు. అయితే కొవ్వూరు సీటుకు వేమగిరి వెంకట్రావు, టీవీ రామారావు పోటీ పడుతున్నారు. నిడదవోలు టికెట్‌ రేసులో సిట్టింగ్ ఎమ్మెల్యే శేషారావు, సత్యనారాయణ ఉన్నట్లు సమాచారం. రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయనని ఎంపీ మురళీమోహన్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Related posts