ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 5వ తేదీన 26 మంది ఐపీఎస్ లను జగన్ సర్కారు బదిలీ చేసింది. ఇప్పుడు మరో 21 మందికి స్థానచలనం కల్పించడంతో, 15 రోజుల వ్యవధిలో 47 మంది ఐపీఎస్లు బదిలీ అయ్యారు. కాగా గతంలో బదిలీ అయినవారిలో ఐదుగురు మరోసారి బదిలీ కావడం గమనార్హం.
ఇక తాజా బదిలీలలను పరిశీలిస్తే, టీడీపీ ప్రభుత్వంలో శాంతిభద్రతల కో ఆర్డినేషన్ ఐజీగా ఉన్న ఘట్టమనేని శ్రీనివాస్ ను తొలుత అనంతపురం పీటీసీకి బదిలీ చేయగా, ఇప్పుడాయన్ను అక్కడి నుంచి తప్పించి, పోలీస్ హెడ్ క్వార్టర్ లో రిపోర్టు చేయాలని ఆదేశించారు.ఆయనతో పాటు ఐఏఎస్ ఆఫీసర్లు కోయ ప్రవీణ్, జీవీజీ అశోక్ కుమార్, సర్వ శ్రేష్ట త్రిపాఠి, జీ పాల్ రాజ్, ఎస్కేవీ రంగారావు, ఎస్ హరికృష్ణ, కేవీ మోహన్ రావు, విక్రాంత్ పాటిల్ తదితరులు బదిలీ అయిన వారిలో ఉన్నారు.


ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది.. రేపు వైసీపీకీ ఇదే గతి పడుతుంది:కన్నా