ఏపీ రాష్ట్రంలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది.
నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
ఈ నెల 22వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు.
ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు, ఈ నెల 24న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకూ వేలం నిర్వహిస్తారు.
ఎంపికైన వారికి అధికారులు లైసెన్సులు జారీ చేయనున్నారు.

