telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు… స్పందించిన శ్రీముఖి

Srimukhi

ప్రముఖ యాంకర్ శ్రీముఖి తాజాగా తనపై నమోదైన కేసుపై స్పందించారు. తనకి ఏ వర్గాన్ని కించపరిచే ఉద్ధేశ్యం లేదని, సమాజంలో అన్ని వర్గాలకు తానూ సమాన గౌరవం ఇస్తానని చెప్పింది శ్రీముఖి. ఈ విషయంలో పోలీసులకు అన్ని విధాలుగా సహకరించడానికి తాను సిద్ధంగానే ఉన్నానని చెప్పింది. అయితే తెలిసో తెలీకో తాను తప్పుు చేసి ఉంటే సారీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది శ్రీముఖి. అలాగే 2018లోనే ఆ షో ముగిసిపోయిందని.. తొలిసారి ప్రసారమైనప్పుడు కంటెంట్ మీద ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ఇప్పుడు ఎవరు? ఎందుకు? కేసు వేశారో అర్థం కావడం లేదని చెప్పుకొచ్చింది శ్రీముఖి. ఆ షోలో ఏ వీడియో క్లిప్ మీద వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో తనకు తెలీదని తెలిపింది. ఇక కేసు విషయానికొస్తే… బ్రాహ్మణులను కించపరిచే విధంగా కామెడీ షోలో దృశ్యాలను చిత్రీకరించారని ఓ ప్రముఖ టీవీ ఛానెల్, యాంకర్ శ్రీముఖిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. కామెడీ షోలో బ్రాహ్మణులను కించపరుస్తున్నారంటూ నల్లకుంటకు చెందిన వెంకట రమణ శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. కార్యక్రమ వీడియోలను కూడా చూపించాడు.

Related posts