telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ 2021 : ముగిసిన రాయల్స్ ఇన్నింగ్స్.

ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ తీసుకోవడంతో రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేసింది. అయితే రాయల్స్ ఓపెనర్లు జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. ఓపెనర్లు జోస్ బట్లర్ (41), యషస్వి జైస్వాల్ (32) తో రాణిస్తుండగా ముంబై బౌలర్ రాహుల్ చాహర్ వారిని పెవిలియన్ చేర్చాడు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ సంజు సామ్సన్ (42), శివం దుబే (35) నిలకడగా రాణిస్తూ చివర్లో ఔట్ అయ్యారు. దాంతో నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది రాయల్స్. ఇక రాజస్థాన్ బౌలర్లలో రాహుల్ చాహర్ రెండు వికెట్లు తీయగా జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ ఒక్కో వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ లో గెలవాలంటే ముంబై 172 పరుగులు చేయాలి. అయితే గత మూడు మ్యాచ్ లలో ముంబై 150 పరుగులకంటే ఎక్కువగా చేయలేకపోయింది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఆ జట్టు ఏం చేస్తుంది అనేది.

Related posts