ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పై ఏపీ ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) ను ఆశ్రయించారు. ఆయనపై విధించిన సస్పెన్షన్ ను రద్దు చేసేందుకు నిరాకరించింది.
సర్వీస్ నిబంధనలను అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలతో భద్రతా ఉపకరణాల కొనుగోళ్లలో నిబంధనలను ఆయన అతిక్రమించారని ఆరోపించింది. ప్రజాప్రయోజనాల రీత్యా విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నామని ఏపీ సర్కార్ ప్రకటించింది. దీంతో ఆయన క్యాట్ ను ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను క్యాట్ కొట్టి వేసింది.