telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

సంక్షేమ పథకాలతో జగన్‌కు ఫ్రస్టేషన్: చంద్రబాబు

సంక్షేమ పథకాలతో జగన్‌కు ఫ్రస్టేషన్ పెరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. హైదరాబాద్‌లో కూర్చుని కేసీఆర్‌తో కలిసి జగన్‌ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.  వైసీపీలో చేరాలని హైదరాబాద్‌లో ఆస్తులు ఉన్న నేతలను బెదిరిస్తున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ పోలవరంపై కేసులు వేసినవాళ్లతో వైసీపీ లాలూచీపడిందన్నారు. మూడు పార్టీల కుట్రలు నెరవేరితే రాష్ట్రానికి నీళ్లు రావని  చంద్రబాబు అన్నారు. 
పదవులపై ఆశలు ఉన్న ఒకరిద్దరికి తప్పుడు సర్వేలు చూపి మభ్య పెడుతున్నారన్నారు. అలా పార్టీనీ వీడేవారిని పట్టించుకోవద్దని నేతలకు తెలిపారు. వచ్చే ఎన్నికలు ఏకపక్షమే అని తేల్చిచెప్పారు. పింఛన్ల పెంపు, పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇవాళ, రేపు, ఎల్లుండి అన్నదాత సుఖీభవ వేడుకలు నిర్వహించాలని నేతలను సీఎం ఆదేశించారు.

Related posts