తెలుగు రాష్ట్రాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కుండపోత వాన కురుస్తోంది. రాష్ట్రాల్లోనూ నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. దాంతో ప్రాజెక్టులు అని నిండుకుండలా మారిపోయాయి. ఇక హైదరాబాద్ నగరంలో కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. హైదరాబాద్ సిటీలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ నగరంలో కురిసిన వర్షాలకు నగరం చిగురుటాకులా వణికింది. ఈ భారీ వర్షానికి కొన్ని చోట్ల ఇళ్లు కూలిపోయాయి. ఈ వర్షాల కారణంగా ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ విషయం పై క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. అందులో ”ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తెలంగాణ, ఆంధ్రాలో జరిగిన నష్టాన్ని చూసి చాలా బాధపడ్డాను. మరింత నష్టం జరగకుండా ఈ భారీ వర్షాల నుండి పరిస్థితులు త్వరగా మెరుగు పడాలని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని అభ్యర్థిస్తున్నాను” అని ట్విట్ చేసాడు. అయితే ప్రస్తుతం ఐపీఎల్ 2020 లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు మెంటర్ గా వ్యవరిస్తున లక్ష్మణ్ యూఏఈ లో ఉన్నాడు.
previous post
టీటీడీ బోర్డును సీబీఐ ఛార్జ్ షీట్ లా చేశారు: అనురాధ ఫైర్