telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అకాల మరణం తనను కలచివేసింది

ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 8.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. వైద్యులు గౌతమ్‌రెడ్డిని ఐసీయూలో చేర్చి అత్యవసర సేవలు అందించినా ప్రాణాలు దక్కలేదు.

దీంతో మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాత్మరణం పట్ల పార్టీల‌కు అతీత‌కంగా ప‌లువురు నేత‌లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మంత్రి మేకపాటి అకాల మరణం తనను కలచివేసిందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. మంచి రాజకీయ భవిష్యత్ ఉన్న నేత చిన్న వయసులోనే కన్ను మూశారని ఆవేదన చెందారు.

 

Related posts