ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రణం రౌద్రం రుధిరం). అలియాభట్, ఓలివియా మోరీస్ కథానాయికలుగా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కాగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. ఐదు నెలలుగా చిత్రీకరణ పునఃప్రారంభించాలని ప్రయత్నాలు జరిగాయి. కానీ, సెట్స్ మీదకు వెళ్లలేదు. మధ్యలో నిర్మాత డీవీవీ దానయ్య, దర్శకుడు రాజమౌళి కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు వాళ్లిద్దరూ కోలుకున్నారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. చిత్రీకరణ ప్రారంభించడానికి ఎన్టీఆర్, రామ్చరణ్ సైతం సిద్ధంగా ఉండటంతో విజయదశమి తర్వాత సెట్స్ మీదకు వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో ఆర్టిస్టులు, టెక్నిషియన్లతో తెరకెక్కించే సన్నివేశాలను ముందుగా చిత్రీకరించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ఈ నెలాఖరున లేదా అక్టోబర్ తొలి వారంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ మళ్లీ మొదలవుతుందని ఫిల్మ్నగర్ వర్గాల సమాచారం.
previous post
“సాహో” రివ్యూలపై సుజీత్ కామెంట్స్