ఇండియాలో భారీ ఆదరణ పొందిన పబ్-జి గేమ్ను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఎన్ కోర్ గేమ్స్’ సంస్థ తాజాగా ‘ఫియర్లెస్ అండ్ యునైటెడ్: గార్డ్స్’ (FAU:G) పేరుతో ఓ యాక్షన్ గేమ్ను రూపొందించింది. ప్రధాని నరేంద్రమోదీ ‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తితో, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నేతృత్వంలో ఈ గేమ్ రూపొందింది. ఈ గేమ్ గురించి అక్షయ్ తాజాగా ట్వీట్ చేశారు. “ప్రధాని నరేంద్రమోదీ ‘ఆత్మనిర్భర్ భారత్’ ఉద్యమ స్ఫూర్తితో ‘ఫియర్లెస్ అండ్ యునైటెడ్: గార్డ్స్’ (FAU:G) అనే యాక్షన్ గేమ్ను సగర్వంగా ప్రకటిస్తున్నాను. ఈ గేమ్ ఆడడం ద్వారా వినోదం మాత్రమే కాకుండా, మన సైనికుల త్యాగాల గురించి కూడా ఆటగాళ్లు తెలుసుకుంటారు. ఈ గేమ్ ద్వారా వచ్చే ఆదాయంలో 20 శాతం ‘భారత్ కా వీర్’ ట్రస్టుకు అందుతుంది” అని అక్షయ్ పేర్కొన్నారు. ఈ గేమ్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.
Supporting PM @narendramodi’s AtmaNirbhar movement, proud to present an action game,Fearless And United-Guards FAU-G. Besides entertainment, players will also learn about the sacrifices of our soldiers. 20% of the net revenue generated will be donated to @BharatKeVeer Trust #FAUG pic.twitter.com/Q1HLFB5hPt
— Akshay Kumar (@akshaykumar) September 4, 2020