telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ సెక్రటేరియట్ లో మరోసారి కరోనా కలకలం

AP Secretariate

ఏపీ సచివాలయంపై కరోనా వైరస్ మరోసారి కన్నెర్ర చేసింది. కొత్తగా 14 మంది ఉద్యోగులు మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ఏపీ సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఉద్యోగులతో కాంటాక్ట్‌ అయిన వారు టెస్ట్‌లు చేయించుకోవాలని వైద్యాధికారులు సూచించారు. మరోవైపు సచివాలయాన్ని శానిటైజ్ చేశారు.

రాష్ట్రంలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. ప్రతి రోజు దాదాపు 10 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఏపీ సచివాలయంలో ఇప్పటికే పలువురు ఉద్యోగులు కోవిడ్ భారీన పడగా .. తాజాగా మరోసారి సెక్రటేరియట్ పై కరోనా పంజా విసిరింది.

Related posts