ప్రజల ప్రాథమిక హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ దళిత విద్యార్థి, రీసెర్చ్ స్కాలర్ ఆరేటి మహేశ్ నిరసనకు దిగిన నేపథ్యంలో చంద్రబాబు స్పందించారు. ఆయనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ భారత పౌరులకు ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఏపీలో కాలరాస్తున్నారని అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ దళిత విద్యార్థి, రీసెర్చ్ స్కాలర్ ఆరేటి మహేశ్ ఉన్నత చదువులకు ఆటంకాలు కల్పిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విధమైన కక్షసాధింపు గర్హనీయంమని విమర్శించారు.
దళితుల చదువుకు అడ్డుపడటం ఫ్యాక్షనిస్టుల దుష్ట సంస్కృతి అన్నారు. దళితులపై దాడులు అత్యాచారాలువంటి ఈ పాలకులగతి తప్పినచర్యలను దళిత సమాజమే నిగ్గదీయాలి. నిరాహార దీక్ష చేస్తున్న మహేశ్కి తక్షణమే న్యాయం చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు.