అమరావతిలోని ఏపీ సచివాలయంలో అడ్డుగోడల నిర్మాణం కొనసాగుతోంది. ఇప్పటికే సచివాలయానికి ఉత్తరం దిశగా ఉన్నగేటుకు, దాని ఎదురుగా దక్షిణ దిశలో మొదటి బ్లాకు పక్కనున్న గేటుకు, అసెంబ్లీ 5వ గేటుకు అడ్డంగా గోడలు నిర్మించిన సీఆర్డీఏ అధికారులు బుధవారం తాజాగా రెండవ గేటు పక్కన ఉండే సందర్శకుల భవనం ముందు ప్రహరీ నిర్మిస్తున్నారు.
దీంతో ఇప్పటి వరకు సచివాలయం బయటకు కనిపించే గ్రీవెన్స్ భవనం ప్రహరీ లోపలకు వెళ్లనుంది. సచివాలయం ప్రహరీ గోడకు, సందర్శకుల భవనానికి మధ్య కొంత ఖాళీ ఉంది. సచివాలయానికి ఉత్తరం దిశగా ఉన్న గేటుకు, దానికి ఎదురుగా దక్షిణ దిశలో మొదటి బ్లాకు పక్కనున్న గేటుకు అడ్డంగా గోడలు నిర్మించారు. అలాగే, సచివాలయం వైపు నుంచి అసెంబ్లీకి వెళ్లే అసెంబ్లీ అయిదవ గేటుకు కూడా అడ్డంగా గోడకట్టారు. వాస్తు ఉద్దేశంతోనే ఈ గోడల నిర్మాణం చేపట్టినట్టు తెలుస్తోంది.
గాజువాక, భీమవరంలో చంద్రబాబు ప్రచారం చేయరు: జగన్