రాహుల్ ద్రవిడ్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ద్రవిడ్ కోచ్ గా కొనసాగుతున్నాడు. అయితే తాను ఇలా మారడానికి కారణం భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అంటున్నాడు. ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ద్రవిడ్ మాట్లాడుతూ… “నా క్రికెట్ కెరియర్ చివరి దశకు వచ్చిన తర్వాత నేను ఏం చేయాలి అనే సందేహంలో ఉన్నాను. అప్పుడు కపిల్ దేవ్ నా వద్దకు వచ్చి నువ్వు తొందర పాటులో ఎటువంటి నిర్ణయం తీసుకోకు. కొన్ని రోజులు వేర్వేరు పనులు చేసి అందులో ఏది నచ్చుతుందో దానిని ఎంపిక చేసుకో అని చెప్పాడు. ఆ మాటలు నిజంగా నాకు చాలా ఉపయోగపడ్డాయి. ఆయన అలా చెప్పినప్పుడే నా కెరీర్ చివరి భాగంలో నేను అప్పటికే రాజస్థాన్ రాయల్స్ కు కెప్టెన్-కోచ్ బాధ్యతలలో ఉన్నాను. దానినే కొనసాగించాను. నేను ఇలా కోచ్ గా మారడానికి ఆయనే కారణం” అని ద్రవిడ్ చెప్పాడు. ప్రస్తుతం అండర్ -19 మరియు ఇండియా ఏ సెటప్లో భాగంగా అలాగే ఎన్సిఎ అధినేతగా రాహుల్ ద్రవిడ్ కొనసాగుతున్నాడు.
previous post