తమిళనాడులోని తిరువళ్లూరు వద్ద ఒంగోలుకు చెందిన ఓ కారులో రూ.5.27 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటిదే మరో ఘటన ఏపీలో జరిగింది. కర్నూలు జిల్లా పాణ్యం మండలం చాపిరేవుల టోల్ ప్లాజా వద్ద ఓ కారులో రూ.1 కోటి 80 వేలు స్వాధీనం చేసుకున్నారు.
కారు హైదరాబాద్ నుంచి తమిళనాడులోని కోయంబత్తూరు వెళుతున్నట్టు గుర్తించారు. ఈ డబ్బుకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారును సీజ్ చేసిన పోలీసులు అనంతరం కేసు నమోదు చేశారు.


చంద్రబాబు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తప్పుల తడక: మంత్రి అనిల్