మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా ఈ ఏడాది పరిస్థితుల గురించి సింగిల్ లైన్లో చెబుతూ సందేశమిచ్చారు. కరోనా కారణంగా ఈ ఏడాది జన జీవనం స్తంభించి పోవడమే గాక, ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ అంతా అతలాకుతలమైంది. ఎక్కడి షూటింగ్స్ అక్కడే ఆగిపోయి దర్శక నిర్మాతలు, హీరో హీరోయిన్ల ప్లాన్స్ తలక్రిందులయ్యాయి. కరోనా విలయతాండవం ఎంతకాలమో అర్థం కాని పరిస్థితి. ఎవ్వరూ ఉహించించని ఈ విపత్కర పరిస్థితుల నుంచి ఎప్పుడు భయటపడతామనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను ఉద్దేశిస్తూ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన ఇన్స్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ సందేశం పోస్ట్ చేశారు. 2020.. ఈ ఏడాది వేసుకున్న ప్లాన్స్ అన్నీ బ్లర్ అయ్యాయి అని పేర్కొంటూ మొత్తం పింక్ కలర్లో ఉన్న ఓ బ్లర్ పిక్ షేర్ చేశారు. ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమాకు ఒప్పుకున్న వరుణ్.. అందుకోసం ప్రిపేర్ అవుతున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న అల్లు బాబీ – సిద్ధూ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్గా కనిపించనున్నారు.
previous post
పవన్ కళ్యాణ్ పై చేసిన విమర్శలకు కోన వెంకట్ వివరణ