ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా బీఏసీ సమావేశం నిర్వహించారు. పలు బిల్లులు ఆమోదించాల్సి ఉన్న నేపథ్యంలో శాసనమండలి సమావేశాలు మూడు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. సభలో ఏ బిల్లులు ప్రవేశపెడుతున్నారో సమాచారం ఇవ్వాలని టీడీపీ నేతలు కోరారు.
ఒకవేళ మండలి సమావేశాల్లో సీఆర్డీయే రద్దు బిల్లు ప్రవేశపెట్టాలనుకుంటే, అది సరైన నిర్ణయం కాదని టీడీపీ సభ్యులు స్పష్టం చేశారు. అటు, ఏపీ అసెంబ్లీని రెండ్రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.