తెలంగాణ శాసనసభా పక్ష (సీఎల్పీ) నేతను ఎన్నుకునేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ ఉదయం అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమయ్యారు. సీఎల్పీ భేటీకి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, టీ కాంగ్రెస్ ఇంచార్జి ఆర్సీ కుంతియా హాజరయ్యారు. శాసనసభాపక్ష నేతగా ఎవరిని నియమించాలనే నిర్ణయాన్ని పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కట్టబెడుతూ కాంగ్రెస్ నేతలు తీర్మానం చేశారు.
సీఎల్పీ నేత కోసం ఎమ్మెల్యేల అభిప్రాయాలను వేణుగోపాల్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేల అభిప్రాయాలను పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అందజేస్తాన్నారు. సీఎల్పీ నేత ఎన్నిక విషయంలో రాహుల్ నిర్ణయమే ఫైనల్ అన్నారు.
సాహసకృత్యాలు దేశాన్ని ముందుకు నడిపించలేవు: ప్రణబ్ ముఖర్జీ