నాగార్జున నటించిన సినిమాల్లో “క్రిమినల్” ఎవర్ గ్రీన్ మూవీ. 25 ఏళ్ళ క్రితం మహేష్ భట్ దర్శకత్వంలో క్రిమినల్ చిత్రం తెరెక్కింది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు లభించాయి. తెలుగులో నాగార్జున, రమ్యకృష్ణ, మనీషా కోయిరాలా ముఖ్య పాత్రలు పోషించగా, ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ కొందరు ఎంతో ఇష్టంగా వింటుంటారు. ఇక ఈ సినిమాలో ‘తెలుసా… మనసా… ఇది ఏనాటి అనుబంధమో ..” అంటూ సాగే పాట ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్. అయితే తాజాగా మరోసారి ఈ పాట హాట్ టాపిక్గా మారింది. మరోసారి ఈ పాటకు సంబంధించిన హిందీ, తెలుగు వర్షెన్ని అనూప్ శంకర్ స్వయంగా పాడి సమాజానికి సేవ చేసే నిస్వార్థ హృదయాలకు అంకితమిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఈ విషయం తెలుసుకున్న నాగార్జున తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. “ఈ పాటను నిస్వార్ధ సేవ చేస్తున్న వారికి అంకితం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. కీరవాణి స్వరపరచిన ఈ అందమైన పాట 25 ఏళ్లు పూర్తి చేసుకుంది” అంటూ నాగ్ తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. తెలుసా మనసా పాటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ అందించగా, పాటను బాలు, చిత్ర అద్భుతంగా ఆలపించారు.
Thank you anoop Shankar!! It’s been 25 years since this beautiful song was composed by @mmkeeravaani 🙏 so happy to know You are Dedicating this song to the Selfless hearts who serve society!!👉 https://t.co/0AtrQpfAzf#worldnursesday #tribute insta Id @singeranoopsankar
— Nagarjuna Akkineni (@iamnagarjuna) May 12, 2020