పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ మరోసారి నటిస్తుండగా.. ఈ సినిమాకు రాక్స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే చాలాసార్లు హరీష్ శంకర్ క్లూ ఇచ్చినప్పటికీ.. తాజాగా అధికారికంగా ప్రకటించారు. పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన గబ్బర్ సింగ్ విడుదలై ఎనిమిదేళ్లు పూర్తైంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర యూనిట్ అందరికీ కృతఙ్ఞతలు చెప్పిన హరీష్.. పవన్ చిత్రానికి మళ్లీ దేవీ మ్యూజిక్ ఇవ్వబోతున్నాడని ప్రకటించేశారు. “ఇది నాకు వండర్ఫుల్ డే. 8 ఏళ్ల క్రితం ఇదే రోజు ఓ ఎనర్జిటిక్ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా మేము మళ్లీ రాబోతున్నాం అని చెప్పడానికి మించిన ప్రకటన ఏముంటుంది. పవన్ 28వ చిత్రానికి దేవీ శ్రీ సంగీతం అందించబోతున్నారు. మేము మళ్లీ వస్తున్నాం. ఇప్పుడే మొదలైంది” అని కామెంట్ పెట్టారు. పవన్ మేనరిజం, హరీష్ తెరకెక్కించిన తీరు, దేవీ అందించిన అద్బుతమైన ఆల్బమ్.. గబ్బర్ సింగ్ను పవన్ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేని విధంగా చేశాయి. ఇక ఈ కాంబినేషన్లోనే ఇప్పుడు మరో చిత్రం రానుండటంతో పవర్స్టార్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న విషయం తెలిసిందే.
It is a wonderful day. As enrgetic as the release day 8 years ago. What better day to announce that we are coming back together to recreate the same musical energy again. @ThisisDSP will be scoring music for #PSPK28.
We are coming again
Ippude modalaindi…. pic.twitter.com/hXTA0cPDXW— Harish Shankar .S (@harish2you) May 11, 2020
ఈసారి చెంప చెళ్ళుమన్పిస్తా… : చిన్మయి శ్రీపాద