telugu navyamedia
రాజకీయ వార్తలు

తన కుటుంబానికి రూ.143.26 కోట్లు ఆస్తులు: ఉద్ధవ్ థాకరే

uddhav-thackeray-shivasena

మహారాష్ట్రలో ఖాళీగా ఉన్న 9 ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 21న ఎన్నికలు జరగనున్నాయి. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తన ఆస్తులను ప్రకటించారు.తనకు, తన కుటుంబానికి కలిపి రూ.143.26 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ఎన్నికల అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో సీఎం పేర్కొన్నారు. తనకు సొంత కారు కూడా లేదని అందులో పేర్కొనడం గమనార్హం.

తనకు రూ.4.06 కోట్ల రుణంతోపాటు రూ.15.50 కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే, రూ. 81.37 కోట్ల స్థిరాస్తులు, రూ.61.89 కోట్ల చరాస్తులు ఉన్నాయని తెలిపారు. తమకు రూ.76.59 కోట్ల వ్యక్తిగత ఆస్తులు ఉన్నట్టు తెలిపారు. శివసేన పార్టీ పత్రిక సామ్నా ఎడిటర్ అయిన తన భార్య రష్మీ థాకరేకు పలు వ్యాపారాలు ఉన్నాయని, వడ్డీలు, అద్దెలు, కంపెనీ షేర్ల లాభాలు, డివిడెండ్ల ద్వారా ఆమెకు ఆదాయం వస్తుందని తెలిపారు.

Related posts