నందమూరి బాలకృష్ణ తన ఫ్యామిలీతో కలిసి సంక్రాంతి వేడుకను తన సోదరి పురందేశ్వరి ఇంట్లో ఇంట్లో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. కుటుంబ సమేతంగా ప్రకాశం జిల్లా కారంచేడుకు వెళ్లిన బాలయ్య.. గత రెండు రోజులుగా అక్కడే సందడిగా గడుపుతున్నారు.
సంక్రాంతి సంబరాల్లో భాగంగా శనివారం గుర్రం ఎక్కి హంగామా చేసిన బాలయ్య.. ఆ తర్వాత ఎండ్లబండిపై సందడి చేశారు.ఆదివారం ఉదయం కుటుంబ సమేతంగా చీరాల చీచ్కు వెళ్లిన బాలయ్య తన భార్య వసుంధరతో కలిసి చీరాల బీచ్లో సందడి చేశారు.
టాప్ లెస్ ఫోర్డ్ జీప్లో తన భార్య వసుందరను పక్కన కూర్చోపెట్టుకొని స్వయానా బాలకృష్ణ బీచ్ వద్ద జీపు నడిపారు. అనంతరం కుటుంబ సభ్యులతో బీచ్లో కొద్దిసేపు గడిపారు.
అక్కడున్న జనం బాలయ్య దంపతులను ఫోన్ వీడియో తీస్తూ కేరింతలు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.