కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ కొనసాగుతున్న కారణంగా సెలబ్రిటీలందరూ సోషల్ మీడియాకే పరిమితం అయ్యారు. సినిమా, సీరియళ్ళ షూటింగులు కూడా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు సెలెబ్రిటీలందరూ ఈ లాక్ డౌన్ టైంలో ఎలా గడుపుతున్నారో సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో పంచుకుంటున్నారు. కొందరు వంటలు నేర్చుకుంటుంటే… మరికొందరు ఇంటి పనిలో భార్యలకు సహాయపడుతున్నారు. మరికొంతమంది సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా దేశ ప్రజలందరూ నెలన్నర నుంచి లాక్డౌన్లోనే గడుపుతున్నారు. అయితే బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్కు మాత్రం 22 ఏళ్ల క్రితమే లాక్డౌన్ ప్రారంభమైందట. భార్య కాజోల్తో గతంలో కలిసి దిగిన ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన అజయ్.. “నాకు లాక్డౌన్ మొదలై 22 సంవత్సరాలు అయినట్టు అన్పిస్తోంది” అని కామెంట్ చేశాడు. అజయ్ దేవగణ్ పోస్ట్ కు భారీ స్పందన వస్తోంది. 22 ఏళ్ల క్రితం కాజోల్, అజయ్ దేవగణ్ వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. 1999లో వివాహం చేసుకున్న అజయ్, కాజోల్ జంటకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.
View this post on Instagram
Feels like it’s been twenty two years since the lockdown began. #FridayFlashback @kajol