ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శనాస్త్రాలు సంధించారు. ‘దేవుడి స్క్రిప్ట్’ భలే ఉంటుందంటూ జగన్ గతంలో చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. జగన్ మాటలను గుర్తు చేస్తూ ప్రభుత్వ తీరుపై ఆయన చురకలంటించారు.
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో 23 మంది ఎమ్మెల్యేలను కొన్నవారికి 2019 ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను కొన్నందుకు కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే మిగిలారని అప్పట్లో ఆయన అన్నారు. దేవుడి స్క్రిప్ట్ ఇలా ఉంటుందని దేవినేని వ్యాఖ్యానించారు.
కరోనా విజృంభిస్తున్న క్లిష్ట సమయంలో ముందుండి నడిపించే ఉద్యోగులకు సగం జీతాలే ఇస్తారు. డాక్టర్లకి మాస్కులు కూడా అందించరు, కానీ వేలకోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టి ప్రభుత్వ భవనాలకు వేసిన మీ పార్టీ రంగులు మార్చడానికి మళ్లీ కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నారని దుయ్యబట్టారు.