telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కమల్ నోట కరోనా పాట … తరలి వచ్చిన తారలు…

Kamal-Hassan

కరోనా వైరస్ మహమ్మారి నివారణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న పోలీసులు, వైద్యులను ప్రశంసిస్తూ ఇప్పటికే పలు పాటలు వచ్చాయి. తాజాగా ప్రముఖ హీరో కమల్ హాసన్ పాడిన పాట కోసం దక్షిణాదికి చెందిన పలువురు తారలతో పాటు గాయనీగాయకులు తరలివచ్చారు. కమల్ హాసన్ దేశంలో ఉన్న పరిస్థితులను గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. పోలీసులకు, వైద్యులకు వందనం చేస్తూ ఓ పాటను రాశారు. అంతేకాకుండా ఆ పాటను ఆయనే స్వయంగా ఆలపించారు. ఈ పాటకు జిబ్రాన్ సంగీతమందించారు. ఇక ఈ పాటను కమల్‌తో పాటు ఆయన కూతురు శ్రుతి హాసన్, దేవీశ్రీ ప్రసాద్, యువన్ శంకర్ రాజా, అనిరుధ్, శంకర్ మహదేవన్, సిద్ శ్రీరామ్, సిద్ధార్థ్, ఆండ్రియా తదితరులు ఆలపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Related posts