యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుస్తోన్న భారీ మల్టీస్టారర్ ‘రౌద్రం రుధిరం రణం’ (RRR)కు ‘బాహుబలి’కి మించి ప్రచారం కల్పించాలని రాజమౌళి భావిస్తున్నారు. RRR సినిమాకు నేషనల్ లెవెల్లో సూపర్ క్రేజ్ తీసుకురావాలంటే లోకల్ యాక్టర్స్ను కూడా రంగంలోకి దించాలని రాజమౌళి ముందుగానే ప్లాన్ వేశారు. అందుకే, బాలీవుడ్ నుంచి అజయ్ దేవగణ్ లాంటి స్టార్ హీరోని తీసుకున్నారు. అలాగే, రామ్ చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారు. అయితే, సౌత్లోని తెలుగుతోపాటు పెద్ద మార్కెట్లుగా ఉన్న తమిళం, మలయాళంపై కూడా రాజమౌళి దృష్టి సారించారట. అందుకే, తమిళ ఇండస్ట్రీ నుంచి స్టార్ హీరో దళపతి విజయ్ను ఒక చిన్న అతిథిపాత్ర కోసం రాజమౌళి సందప్రదించారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, మలయాళం నుంచి సూపర్స్టార్ మోహన్లాల్ను రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నారట జక్కన్న. కథ ప్రకారం కొమరం భీమ్కు బాబాయ్ ఉంటారట. ఆయనే కొమరం భీమ్ను ఉద్యమం వైపు ప్రోత్సాహిస్తారట. ఆ పాత్రలో మోహన్లాల్ను నటింపజేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయన మోహన్లాల్ను సంప్రదించారట. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్గా కనిపించనున్న సంగతి తెలిసిందే.
“ప్రధాని నరేంద్ర మోడీ మీదనే పోరాటం చేసిన ప్రకాష్ రాజ్ “మా”.. లో .. ఇలా ..?” -శివాజీ