మహేశ్ కు పరుశురామ్ వినిపించిన కథ నచ్చడంతో స్క్రిప్ట్ డెవలప్ చేసుకోని రమ్మనగా తాజాగా ఆయన ఫుల్ స్క్రిప్ట్ ను సూపర్ స్టార్ కు మెయిల్ చేసినట్టు తెలుస్తోంది. కథ కంప్లీట్ గా నచ్చడంతో..ప్రస్తుతం బడ్జెట్, డేట్స్ పై వర్కువట్ చేస్తున్నట్టు సమాచారం. మహేష్ సరిలేరు నీకెవ్వరు తర్వాత 3 నెలలు మాత్రమే బ్రేక్ తీసుకోవాలని భావించాడు. కోవిడ్ -19 వ్యాప్తి కారణంగా ఆ సమయం మరింత పెరిగింది. ఈ లోపులో తదుపరి సినిమాకు సంబంధించిన అన్ని విషయాలు ఫైనలైపోతాయి. అందుకే లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటే షూట్ స్టార్ట్ చెయ్యాలని సూపర్ స్టార్.. పరశురామ్ ని ఆదేశించినట్టు సమాచారం.