క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం ఎప్పుడూ సీరియస్ గానే కన్పిస్తుంటారు. కానీ తాజాగా బయటకు వచ్చిన ఒక ఫొటోలో ఆయన సిగ్గుపడుతూ కన్పించారు. ఇప్పుడు ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘చెలియా’, ‘నవాబ్’ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో నటిస్తోంది అదితి. తాజాగా బయటకొచ్చిన పిక్ లో హీరోయిన్ అదితిరావు హైదరి ఆయనకు రోజా పువ్వు ఇస్తుండగా ఆయన నవ్వుతూ అదితి బుగ్గ గిల్లుతున్నారు. అది కాస్తా కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ కంట పడడంతో ట్విట్టర్లో షేర్ చేసాడు. ‘సూపర్ సీరియస్ మణిరత్నం సిగ్గుపడడం మొట్టమొదటిసారి చూస్తున్నాను’ అంటూ వర్మ ట్వీట్ చేశారు. ఇంకో విశేషం ఏంటంటే ఏప్రిల్ 7న ఆర్జీవీ పుట్టినరోజు అలాగే మణిరత్నం దర్శకత్వంలో అదితి తొలిసారి నటించిన ‘చెలియా’ చిత్రం విడుదలై ఏప్రిల్ 7 నాటికి 3 సంవత్సరాలు అవుతోంది. అదితి తెలుగులో నటించిన ‘వి’ సినిమా ఉగాది కానుకగా మార్చి 25న విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది.
First time I ever saw the super serious Mani Ratnam blushing 😍 pic.twitter.com/P5RpLglPgv
— Ram Gopal Varma (@RGVzoomin) April 7, 2020