టాలీవుడ్లో మరో క్రేజీ మల్టీస్టారర్ సినిమా రానున్నట్లు టాక్ నడుస్తోంది. స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్, విజయ దేవరకొండ కలిసి ఓ మూవీలో కలిసి నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. “యాత్ర” ఫేం మహేష్ వి.రాఘవ్ వీళ్లద్దరి కోసం ఓ స్క్రిప్టు సిద్ధం చేశాడట. ఈ కథ దాదాపు ఫైనల్ అయినట్లేనట. ఈ సినిమాను బన్నీ వాసు, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించనున్నారని టాక్ నడుస్తోంది. 2021 చివర్లో ఈ మల్టీస్టారర్ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందట. కాగా.. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్పా. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని తెగ కష్టపడిపోతున్నారు. ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మెస్తోంది. ఇందులో లక్కీ బ్యూటీ రష్మికా మందన్న బన్నీ సరసన నటిస్తోంది. అటు విజయ్ దేవరకొండ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో “లైగర్” సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత విజయ్, బన్నీ కాంబోలో సినిమా ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
previous post