telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అల్లు అర్జున్ ఇంట్లో విషాదం

Allu-Arjun

టాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ ఇంట విషాదం నెలకొంది. బన్నీ మేనమామ ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్ హఠాన్మరణం చెందారు. గుండెపోటు రావడంతో బుధవారం ఉదయం ఆయన విజయవాడలో కన్నుమూశారు. అల్లు అర్జున్ తల్లి నిర్మలాదేవికి ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్ స్వయానా అన్నయ్య. బన్నీకి పెద్ద మావయ్య. ఈ విషాద వార్త తెలుసుకున్న వెంటనే అల్లు కుటుంబం మొత్తం విజయవాడకు వెళ్లింది. సుకుమార్, బన్నీ కాంబినేషన్‌లో నిర్మితమవుతోన్న సినిమాకి ఈయన సహ నిర్మాత. ఈ సినిమా ద్వారా బన్నీ మేనమామ ప్రసాద్ సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ ప్రాజెక్ట్‌లో ఆయన కూడా భాగస్వామి అయ్యారు. చిత్ర ప్రారంభోత్సవంలోనూ ఆయన పాల్గొన్నారు. దురదృష్టవశాత్తు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకాకుండానే ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ప్రసాద్ మరణంతో అల్లు ఫ్యామిలీలో విషాదం అలుముకుంది. ‘అల వైకుంఠపురములో’ విజయంతో ఎంతో సంతోషంగా ఉన్న అల్లువారింట ఇలాంటి విషాదం చోటు చేసుకోవడం బాధాకరం. ప్రసాద్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Related posts