ముంబై, బాంద్రాలో ఓ వాణిజ్య ప్రకటనకు చెందిన షూటింగులో పాల్గొన్న బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా మీడియాకు తన ముఖం కనపడకుండా ఓ పేపర్ ను అడ్డుగా పెట్టుకుని వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను పోస్ట్ చేసిన ట్వింకిల్ ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను ఇలా వెళ్లిపోయినందుకు మీడియా తనదైన శైలిలో స్పందిస్తుందని తెలిపింది. తాను ఇలా చేయడం వెనక ఉన్న కారణం తెలిస్తే అందరూ షాక్ అవుతారని ట్వింకిల్ ఖన్నా చెప్పింది. ఎందుకిలా చేశానన్న విషయాన్ని తాను త్వరలోనే ప్రకటిస్తానని తెలిపింది. ఓ కొత్త పంథాకు తెరలేపానని చెప్పుకొచ్చింది. అది ఏమిటన్న విషయం తెలియాలంటే ఎదురు చూడాలని పేర్కొంది. ఆమె తీరుపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో 50 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
previous post
next post