నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు.ఇప్పుడు ఆమె కూతురు నిర్వాణ సింగర్గా ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమైంది. శివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వాణ ప్రత్యేక గీతాన్ని ఆలపించింది. ఆ పాటని శివరాత్రి రోజున విడుదల చేయనున్నారు. రీసెంట్గా ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోకి నెటిజన్స్ నుండి మంచి స్పందన వస్తుంది. ఎంఎం ఆర్ట్స్, మంచు మనోజ్, వంశీ, సమీర్, సన్నీ కురపతి తదితరులు నా కలని నిజం చేశారు అని తన ట్విట్టర్లో పేర్కొంది మంచు లక్ష్మీ. కాగా,మంచు లక్ష్మ సరోగసీ పద్ధతి ద్వారా .. నిర్వాణకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
previous post
స్టేజీపై హీరోతో హీరోయిన్ వెటకారం… కార్తీ కౌంటర్…