telugu navyamedia
సినిమా వార్తలు

షాంఘై ఫిల్మ్ ఫెస్టివల్ లో “మహానటి”

Mahanati

మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెర‌కెక్కిన బయోపిక్ “మ‌హాన‌టి”. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన “మహానటి” గ‌త ఏడాది విడుద‌లై మంచి ప్రేక్షకాదరణతో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా పొందింది. అంతేకాదు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్ళు రాబ‌ట్టింది. ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ న‌ట‌న‌కి ప్రేక్ష‌కులు జేజేలు ప‌లికారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, సమంత , విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్ర‌సాద్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. “మ‌హాన‌టి” చిత్రం ఇప్ప‌టికే ఎన్నో ఘ‌న‌త‌లు సాధించ‌గా తాజాగా మ‌రో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. చైనాలోని షాంగై లో జూన్ 15నుండి 24 వరకు 22వ షాంగై ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ జ‌ర‌గ‌నుండ‌గా, ఇందులో ఈ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. షాంగైలో ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతున్న తొలి ఇండియ‌న్ సినిమాగా “మ‌హాన‌టి” అరుదైన ఘ‌న‌త సాధించింది. స్వ‌ప్న సినిమాస్ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా ఈ విష‌యాన్ని పంచుకున్నారు.

Related posts