ఓ తల్లి తన కూతురు హ్యూమన్ ట్రాఫికింగ్ లో చిక్కుకుందని దయచేసి భారత్కు తిరిగి రప్పించాల్సిందిగా వేడుకుంటుంది. హైదరాబాద్ నివాసి సయీద్ సుల్తానా తన వేదనను మీడియాతో తెలియజేస్తూ… తన కూతురు అమ్రీన్ సుల్తానా ఉద్యోగం నిమిత్తం 2017లో సౌదీ అరేబియాకు వెళ్లింది. ఏజెంట్ల మోసానికి గురై సౌదీ అరేబియాలో తీవ్ర చిత్రహింసలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఇద్దరు ఏజెంట్లు సౌదీ అరేబియాలోని దమ్మమ్లో బ్యూటీషియన్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రియాద్లో పనిమనిషిగా నియమించినట్లు వెల్లడించారు.
ఆమెకు జీతం ఇవ్వకపోవడమే కాక కనీసం తినేందుకు ఆహారం, తాగేందుకు నీళ్లు సైతం ఇవ్వకుండా చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు చెప్పారు. ఏజెంట్లు ఆమె వయస్సును 16 నుంచి 28కి పెంచి అక్రమ పద్దతిలో సౌదీకి పంపించారన్నారు. భారత రాయభార కార్యాలయాన్ని అదేవిధంగా ప్రభుభ్వం జోక్యం చేసుకుని తన కూతురిని భారత్కు తిరిగి రప్పించాల్సిందిగా ఆమె వేడుకున్నారు.