సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం “అల వైకుంఠపురములో”. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, గ్లామర్ బ్యూటీ పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ చిత్రంలో సుశాంత్, నవదీప్, టబు ముఖ్య పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే చిత్ర యూనిట్ తమ సినిమా నాన్ బాహుబలి రికార్డులను సాధించిందని ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. ఈ సినిమా వల్ల బన్నీకి చిన్న సమస్య వచ్చింది. దాని వల్ల బన్నీ తన అభిమానులను రిక్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకూ అదేమిటంటే టిక్ టాక్ వంటి వీడియోల్లో సిత్తరాల సిరపడు పాటను చేసేటప్పుడు బీడీలు తాగుతూ తనని అనుకరిస్తున్నారని, అలా చేయవద్దని, తాను నిజ జీవితంలో పొగ తాగనని, కాబట్టి సినిమాలో తాను చేసినట్లు చేయవద్దని రీసెంట్ ప్రెస్మీట్లో చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్.
previous post