telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘మిస్‌ యు మెయిడ్‌’ అంటున్న పాయ‌ల్

payal

కరోనా వైరస్ ప్రభావంతో దేశమంతటా లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. మే 3 వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగించారు. ఈ లాక్‌డౌన్ వ‌ల్ల సామాన్యులే కాదు సెల‌బ్రిటీలు కూడా ఇంటికే పరిమితం అయ్యారు. సినీ స్టార్స్ అయితే ఎవ‌రి ఇంటి ప‌నుల‌ను వారే చేసుకుంటున్నారు. వారు చేస్తున్న ప‌నుల‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ క‌రోనా ఎఫెక్ట్ వ‌ల్ల హీరోయిన్‌ పాయ‌ల్ రాజ్‌పుత్ ఇంటికి ప‌ని మ‌నిషి రావ‌డం లేదు. దీంతో ఇంటినంతా ఈ అమ్మ‌డే శుభ్రం చేసుకుంటోంది. ఈ విషయాన్ని తన ఇన్‌ స్టా గ్రామ్‌లో పోస్ట్‌ చేసి, ‘మిస్‌ యు మెయిడ్‌’ అంటూ పక్కన ఉన్న ఫొటోను షేర్‌ చేశారు.

Related posts