దేశ ఆర్థిక వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం కుప్పకూల్చిందని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు పి. చిదంబరం అన్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలు నుంచి విడుదలైన గురువారం మీడియాతో మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థపై ప్రధాని నరేంద్ర మోదీ ఏనాడు మాట్లాడరు. ఉల్లి ధరలు పెరిగినా ఈ ప్రభుత్వానికి పట్టదు. ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు. వాటి గురించి పట్టించుకోరు.
ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు అని చిదంబరం పేర్కొన్నారు.ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని చిదంబరం పేర్కొన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో తాను ఏం చేశానో అందరికి తెలుసన్నారు. తనతో పని చేసిన అధికారులు, తనను గమనించిన జర్నలిస్టులకు బాగా తెలుసు అని చెప్పారు.