వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి మరణంపై యాంకర్ ప్రదీప్ స్పందించారు. యాంకర్ రవి. ఆయన ట్విట్టర్ అకౌంట్లో వైద్యురాలి మరణం పట్ల ఆవేదనను వ్యక్తం చేస్తూ వీడియోను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “మన దేశం, రాష్ట్రం నీచాతి నీచమైన పరిస్థితిలో ఉంది. ఆడవాళ్ళు బయటకు వెళితే క్షేమంగా వస్తారో? రారోనని భయం ఏర్పడింది. సోషల్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు ఎంతో స్ట్రాంగ్గా ఉన్నాయి. అయినా మహిళల క్షేమం, వారికిచ్చే రక్షణ గురించి మాట్లాడుకుంటున్నామంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నామో, ఎంత దిగజారిపోయామో అర్థం చేసుకోవచ్చు. వెటర్నరీ డాక్టర్ని బ్రతికుండగానే సజీవ దహనం చేయడం ఎంతో దారుణం. ఆ నాకొడుకులు ఎన్ని రోజులు బ్రతుకుతారో తెలియదు కానీ.. చచ్చేరోజు రక్తం కక్కుతూ చావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకూ ఓ బిడ్డ ఉంది. భార్య ఉంది.. అలాగే కజిన్ సిస్టర్స్ ఉన్నారు. మా ఇంట్లోనివారే కాకుండా బయట ఉన్న మహిళలందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరికీ ఇలాంటి దారుణం జరక్కూడదు. మహిళలు ధైర్యంగా ఉండాలి. అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది. ఫోన్లో షీ టీమ నెంబర్స్, పోలీస్ స్టేషన్ నెంబర్స్, మీ ఇంట్లోవాళ్ల నెంబర్స్ ఫేవరేట్ నెంబర్స్గా పెట్టుకోవాలి. స్మార్ట్ ఫోన్ అయితే పవర్ బటన్ను మూడుసార్లు బలంగా నొక్కితే ఎమెర్జెన్సీ కాల్ వెళ్లిపోతుంది. చనిపోయిన మహిళా వైద్యురాలి కుటుంబ సభ్యులను తలుచుకుంటేనే బాధగా ఉంది. అయినప్పుడు చూసుకుందాం లే! అని చాలా మంది మహిళలు అనుకుంటారు. ఒకప్పుడు పెప్పర్ స్ప్రే వాడేవాళ్లు. కానీ ఇప్పుడు అవి ఎక్కడా కనపడటం లేదు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకూడదని కోరుకుంటున్నాను. ప్రభుత్వం ఈ ఘటనలోని నేరస్థులకు కఠిన శిక్షను విధించాలి. నేరస్థులు దారుణంగా, రక్తం కక్కుకుంటూ చావాలి. ఆ చావు చూసి అలాంటి ఇన్టెన్షన్స్ ఉన్న మగవారికి ఇది పడాలి(చిటికెన వేలును చూపిస్తూ). అబ్బాయిలు ప్లీజ్ రా! ప్రతి అమ్మాయిలో అమ్మను చూసుకుంటే బావుంటుంది. ఎప్పుడు మారుతారో ఎమో? అమ్మాయిలు బయటకు వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తగా ఉండండి.. ధైర్యంగా ఉండండి” అని అన్నారు.
Ee Rakshasa Rajyam lo meeru Safe ga undaali ante prathi oka mahila oka Jhansi Lakshmi Bai la undaali. 1/2#anchorravi_offl #anchorravi #rippriyankareddy pic.twitter.com/jEukB27Ft6
— Anchor Ravi (@anchorravi_offl) 30 November 2019
ఒకరు భయపెడితే సినిమావాళ్లు భయపడరు: మురళీమోహన్