రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ చెరుకూరి విజయారెడ్డి అంత్యక్రియలు నాగోల్ శ్మశాన వాటికలో పూర్తయాయి. విజయారెడ్డి అంతిమయాత్రలో రెవెన్యూశాఖ ఉద్యోగులు, స్థానికులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పెద్దసంఖ్యలో ఆమెకు నివాళులర్పించారు. అనంతరం నాగోల్ శ్మశాన వాటికలో విజయారెడ్డి భౌతికకాయానికి భర్త సుభాష్రెడ్డి దహన సంస్కారాలు నిర్వహించి.. అంత్యక్రియలు పూర్తి చేశారు.
అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ కార్యాలయంలో విజయారెడ్దిని సురేశ్ అనే దుండగుడు పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన సంగతి తెలిసిందే. పథకం ప్రకారం తహసీల్దార్ గదిలోకి పెట్రోల్ డబ్బాతో చొరబడ్డ సురేశ్ క్షణాల్లోనే లోనే విజయారెడ్డి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించేశాడు. అందరూ చూస్తుండగానే తహసీల్దార్ విజయారెడ్డి మంటల్లో చిక్కుకొని సజీవదహనమయ్యారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలకం రేపింది.