సాయిపల్లవి ప్రధాన పాత్రలో నటించిన మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ ‘అధిరన్’. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘అనుకోని అతిథి’గా నిర్మాతలు అన్నంరెడ్డి కృష్ణకుమార్, గోవింద రవికుమార్ తీసుకొస్తున్నారు. ‘అంతకు మించి’ అనేది ఉపశీర్షిక. ఇన్ట్రూప్ ఫిల్మ్స్ సమర్పణలో జయంత్ ఆర్ట్స్ పతాకంపై నవంబర్ 15న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘కేరళలో 1970లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. ఫాహద్ ఫాజిల్, ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల సెన్సార్ పూర్తయింది. క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ లభించింది’’ అన్నారు. రెంజి పానికర్, లియోనా లిషోయ్, శాంతికృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దక్షిన్ శ్రీన్వాస్, మాటలు: ఎం. రాజశేఖర్రెడ్డి, పాటలు: చరణ్ అర్జున్, మధు పడిమి కాల్వ, నేపథ్య సంగీతం: జిబ్రాన్, సంగీతం: పిఎస్ జయహరి.
హైదరాబాద్ కు మకాం మారుస్తున్న రేణూదేశాయ్