ఫ్రాన్స్లోని ఓ కుటుంబం వాళ్ళ ఇంటికి క్లీన్ చేసుకునే పనిలో పడింది. ఇంతలో వారి వంట గదిలో ఓ పెయింటింగ్ దొరికింది వారికి. దాన్ని వేలం వేస్తే ఎంత వస్తుందో తెలుసుకోవడానికి ఓ వేలంపాటల నిపుణుడిని ఇంటికి ఆహ్వానించారు. ఇంటిలోని కొన్ని వస్తువులను అతనికి చూపించి, అవి ఎంత ఖర్చు చేస్తాయో తెలుసుకున్నారు. ఈ క్రమంలో వారి వంటగదిలో ఉన్న ఓ పెయింటింగ్ ఆ నిపుణుడి కంటపడింది. ఆ పెయింటింగ్ను పరిశీలించగా అతని గుండె ఆగినంతపనయింది. ఎందుకంటే ఎంతోమంది పరిశోధకులు ఆ పెయింటింగ్ కోసం చాలా ఏళ్లుగా వెదుకుతున్నారు. 13వ శతాబ్దానికి చెందిన ప్రముఖ ఇటాలియన్ చిత్రకారుడు షిమాబుయే వేసిన ఈ చిత్రం ఓ అద్భుతం. ఏసుక్రీస్తుకు ముళ్ల కిరీటం పెట్టే సన్నివేశాన్ని కాన్వాసుపై పెట్టారాయన. చాలాకాలంగా ఇదెక్కడ ఉందో ఎవరికీ తెలియలేదని, కాలగర్భంలో కలిసిపోయిందని అందరూ భావించారని నిపుణులు అంటున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రపటం దొరకడం పట్ల ఆనందం వ్యక్తంచేశారు. దీన్ని వేలంలో పెడితే సులభంగా 6 మిలియన్ డాలర్లు (సుమారు రూ.47కోట్లు) పలుకుతుందని అంచనా. ఈ విషయం తెలుసుకున్న ఆ ఫ్రెంచి జంట.. ఈ చిత్రపటాన్ని వేలంలో విక్రయించడానికి నిర్ణయించుకుంది. ఈ నెల 27న ఉత్తర ఫ్రాన్స్లో వేలంపాట పెట్టి అమ్మేయనున్నారు.
ఉద్యమ నాయకుడు సీఎం కావడం ప్రజల అదృష్టం: తలసాని