ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారుల వద్దకే చేర్చాలన్న ఉద్దేశంతో ఏపీ సర్కారు గ్రామ వాలంటీర్ల నియమాకాలు చేపట్టింది. వీధుల్లో చేరిన కొద్ది రోజులకే కొందరు వాలంటీర్లు దసరా మామూళ్లకు పాల్పడి ఉద్యోగం పోగొట్టుకున్నారు. పింఛన్ బాధితులు కొందరు ఫిర్యాదు చేయడంతో అధికారులు సీరియస్గా తీసుకున్నారు. కృష్ణా జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్గా వ్యవహరించింది. వివరాల్లోకి వెళితే…జిల్లాలోని బందరు మండలం రుద్రవరం ఎస్సీ వాడలో పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని నలుగురు వలంటీర్లు చేపట్టారు.
లబ్ధిదారుల వద్దకు వెళ్లిన వలంటీర్లు పింఛన్ అందజేసిన అనంతరం దసరా మామూళ్లు ఇవ్వాలని కోరారు. కొందరి వద్ద నుంచి రూ.50లు చొప్పున తీసుకున్నారు. అయితే కొందరు లబ్ధిదారులు మాత్రం మామూళ్లు ఇవ్వడానికి నిరాకరించడమేకాక విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో విచారణ జరిపిన బందరు ఎంపీడీఓ జి.వి.సూర్యనారాయణ వలంటీర్లపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలడంతో నలుగురిని విధుల నుంచి తొలగించారు.
ప్రతి రోజూ బాధను అనుభవిస్తూ పాలన: కుమారస్వామి