హైదరాబాద్ జీడిమెట్ల ప్రాంతంలో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కార్తికేయ కామాక్షి కెమికల్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరాగాయి. ఫ్యాక్టరీలో ఉన్న కెమికల్ డ్రమ్ములు ఒక్కొక్కటిగా పేలుతుండటంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. కొద్ది నిమిషాల్లోనే మంటలు కంపెనీ చుట్టూ వ్యాపించాయి. పెద్ద ఎత్తున శబ్ధాలు వస్తుండటంతో భయాందోళనకు గురైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు. అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరిగిందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
previous post