ఈనెల 30 నుంచి ప్రారంభంకానున్న తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాలని ఏపీ సీఎం జగన్ కు టీటీడీ ఆహ్వానం పలికింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి చైర్మన్, అధికారులు ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానపత్రిక అందించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆలయ ఈవో అనిల్కుమార్ సింఘాల్, జేఈవో ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సీఎం వారిని వివరాలు అడిగి తెలుకున్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.