ఇంగ్లాండ్ రాజధాని లండన్లోని భారత దౌత్య కార్యాలయంపై దాడి జరిగింది. జమ్మూకశ్మీర్కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దును నిరసిస్తూ.. పాకిస్థాన్కు చెందిన కొందరు లండన్లోని భారత దౌత్య కార్యాలయం ఎదుట నిన్న నిరసనకు దిగారు. పీవోకే జెండాలను ప్రదర్శిస్తూ, పాకిస్థాన్కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో కార్యాలయంపై దాడి చేసి కిటికీలను పగులగొట్టారు. భవనం యొక్క అద్దాలను ధ్వంసం చేశారు.
దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మేరకు ఇండియన్ హై కమిషన్ ట్వీట్ చేసింది. ఈ ఘటనను లండన్ మేయర్ సాధిక్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడి హేయమైన చర్య అని ఆయన అన్నారు. దాడికి పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.